Life Prisoners: ఏపీలోని జీవితఖైదీలకు గుడ్ న్యూస్...వారికి త్వరలో విముక్తి?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలోని పలు జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అనేక సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారికి విముక్తి కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

New Update
Rajahmundry Central Jail

Rajahmundry Central Jail

Life Prisoners: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా ఏపీలోని పలు జైళ్లలో(AP Jail) మగ్గుతున్న జీవిత ఖైదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అనేక సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారికి విముక్తి కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారి శిక్షను తగ్గించి, ముందుగానే విడుదల చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల అమలుకు ఓ కమిటీని నియమించింది.
Also Read: Madhya Pradesh: భర్తను 36 సార్లు కత్తితో పొడిచి..ప్రియుడికి వీడియో కాల్ లో చూపించిన మైనర్‌ భార్య! 

అర్హులైన ఖైదీలను విడుదల

అందులో భాగంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. దాని ప్రకారం లిస్టు రెడీ చేయడానికి జైళ్ల శాఖ కృషి చేస్తోంది. ఈ లిస్టు ఆధారంగా అర్హులైన ఖైదీలను ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబరు 1వ తేదీల్లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఖైదీకి సంబంధించిన కేసులు, శిక్ష, ఇతరత్రా నిబంధనలకు అనుగుణంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

Also Read: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి 

ముందుగా అర్హులైన ఖైదీల జాబితాను జైళ్ల శాఖ డీజీ ప్రభుత్వానికి పంపిస్తారు.. ఆ తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆ జాబితాను పరిశీలిస్తుంది. ఈ కమిటీలో న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, సీఐడీ ప్రధాన న్యాయ సలహాదారు, నిఘా విభాగాధిపతి, జైళ్ల శాఖ డీజీ సభ్యులుగా ఉంటారు. ప్రతి ఖైదీకి సంబంధించిన కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనర్హులను తొలగిస్తారు.

Also Read:America-Gunturu: టెక్సాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!

అవసరమైన శిక్ష కంటే ముందుస్తు విడుదలైన ఖైదీలు రూ.50 వేలకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. అలాగే ఆయా ఖైదీలు వారి శిక్షాకాలం పూర్తయ్యే వరకూ స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్‌ అధికారి వద్ద ప్రతి 3నెలలకు ఒకసారి హాజరు కావలసి ఉంటుంది. విడుదలైన తర్వాత వారు మళ్లీ నేరం చేసినా, అరెస్టైనా వారి క్షమాభిక్ష రద్దవుతుంది. విడుదలైన ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని.. లేదంటే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. చాలా ఏళ్లుగా ఖైదీల విడుదల ప్రక్రియ ఆగిపోయింది.. దీంతో ఏపీ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!

Advertisment
Advertisment
తాజా కథనాలు