/rtv/media/media_files/2025/04/08/XpnYfsv3W3urdKrDQFv2.jpg)
Food poisoning at Anganwadi center
Food poisoning : ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీలలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడడం వల్ల విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఓ అంగన్ వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటన తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించింది. ఆడుకుంటూ వెళ్లిన విద్యార్థులు అచేతన స్థితిలోకి వెళ్లడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
పెళ్లకూరు మండలం, కానూరు దళిత వాడలోని కానూరు అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం ఉదయం 18 మంది పిల్లలు హాజరయ్యారు. మెనూ ప్రకారం పులిహోర అన్నం వడ్డించారు. దాన్ని తిన్న తర్వాత చిన్నారులు ఇళ్లకు వెళ్లారు. వీరిలో ఐదుగురు చిన్నారులు తీవ్రంగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ నాగరాజు హూటాహుటిన గ్రామానికి చేరుకొని చిన్నారులను నాయుడుపేట సామాజిక వైద్యశాలకు తరలించారు. అస్వస్థత గురైన విద్యార్థులలో గురవయ్య(4) గురువర్షిని (3) నాని(5) జోత్స్న(4) జస్వంత్ (3) ఉన్నారు. వీళ్లకు వైద్యులు చికిత్న అందిస్తున్నారు.
Also read: BIG BREAKING: ‘సింగపూర్లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’
చిన్నారులు అస్వస్థతకు గురి కావడానికి అంగన్వాడీ కేంద్రంలో వడ్డించిన పులిహోరే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్రీదేవి ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలను సేకరించారు. అంగన్ వాడీ కేంద్రంలోనూ తనిఖీలు చేశారు. అంగన్ వాడీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, నిన్న వండిన వంటకాలను ఇవాళ వడ్డిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాసిరకమైన ఆహారం వడ్డిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
Also read: Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్