AP Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ స్పాట్‌డెడ్

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు.

New Update
Deputy Collector dies in road accident Annamayya district

Deputy Collector dies in road accident Annamayya district

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ఈ ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అధికవేగం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్షపు డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించి తమ కుటుంబాలకు విషాదం మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. ఏపీలో దారుణమైన రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ ప్రాణాలు విడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

డిప్యూటీ కలెక్టర్ మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఈ ఘోరమైన ప్రమాదం సంభవించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు