/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
Tirumala Tirupati Devasthanams .
Tirumala: వేసవి సెలవులు ప్రారంభమవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. ఈ ఆదివారం ఒక్కరోజే శ్రీవారిని 80 వేలమంది దర్శించుకున్నారు. ప్రతిరోజు 50 -నుంచి 60 వేల మంది దర్శించుకుంటుండగా ఆదివారం ఒక్కరోజే 82,746 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,078 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
Crowd In Tirumala
ఈ రోజు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే స్థాయిలో భక్తులు వస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏడు నుంచి ఎనిమిది కంపార్టుమెంట్లు నిండే అవకాశం ఉంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారు ఇబ్బంది పడకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేస్తారు.
Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు అదనపు ఏర్పాట్లు చేపట్టారు. వేసవిలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తక్షణ చర్యలకు దిగారు. నారాయణగిరి సహా ఇతర షెడ్ల వద్ద నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేపట్టారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. భక్తుల సంఖ్యను క్రమబద్దీకరిస్తోన్నారు. ఇందులో భాగంగా- శ్రీవారి దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సర్వదర్శన క్యూలైన్లను పరిశీలించారు.
Also Read: Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!
టీబీసీ, ఏటీసీ వద్ద క్యూలైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయడానికి అందుబాటులోకి తీసుకొచ్చిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ను పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాలు అందించాలని వారిని ఆదేశించారు. క్యూ లైన్లల్లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు వారికి కేటాయించిన స్లాట్లోనే క్యూలైన్లలోకి ప్రవేశించాలని చెప్పారు.
Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్
ttd | tirumala-tirupati-devasthanams | tirumala-tirupati | thirupathi | tirumala tirupati darshan tickets | tirumala tirupati temple