/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/3333-jpg.webp)
మరోవైపు ప్రభుత్వం నిర్ణయంపై చాలచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని గ్రూప్ 2 అభ్యర్థులు తిడుతున్నారు. నమ్మ ఓటేస్తే మిమ్మల్ని ముంచేసిందని ఆరోపిస్తున్నారు. చావనైనా చస్తాం కానీ రేపు పరీక్ష రాయమని భీష్మించుకుని కూర్చొంటున్నారు గ్రూప్ 2 అభ్యర్థులు. పరీక్ష వాయిదా విషయంలో ప్రభుత్వం, ఏపీపీఎస్సీ సాకులు వెతుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం సంగతి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Stalin: రూ.10 వేల కోట్లు ఇచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేయం: సీఎం స్టాలిన్
మేమేం చేయలేం...చేతులెత్తేసిన ప్రభుత్వం..
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్పీ సంచలన ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 23నుంచి ఎగ్జామ్ యథాతథంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకోలేమంటూ ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం ఇచ్చింది. అయితే షెడ్యూలు ప్రకారం రేపు ఉదయం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించేదుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుండటంపై సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ తీరుపై మండిపడ్డారు. విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మానవతా దృక్పథంతో స్పందించాలన్నారు. గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోస్టర్ రిజర్వేషన్లు తేల్చేవరకు వాయిదా వేయాలన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో మరింత చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: Bird Flu in Telangana: తెలంగాణలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు