/rtv/media/media_files/2025/04/22/DsTOz9HipGVwClzdkIF3.jpg)
chittor
నాయుడుపేట-పూతలపట్టు ప్రధాన రహదారిలోని రేణిగుంట మండలంలోని మర్రిగుంట సర్కిల్ వద్ద ట్రాక్టర్ ని తప్పించబోయి డిక్సన్ కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్రగాయాలు కాగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
Also Read : సూర్యపేటలో హైటెన్షన్.. రోడ్డుపై ధాన్యం తగలబెట్టిన రైతులు.. ఏం జరిగిందంటే!
45 మంది డిక్సన్ కంపెనీ ఉద్యోగులు ఉదయం డ్యూటీకి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను బాలాజీ ,అమర ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి కారణం ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడమే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:Canada: మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. కెనడాలో హిందూ ఆలయంపై దాడి
Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
chittor | accident | bus