Food Piece Stuck In Throat: ఏపీలో దారుణం.. రెండేళ్ల బాలుడి ప్రాణం తీసిన దోశ

అనంతపురం జిల్లాలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. తపోవనం ప్రాంతానికి చెందిన రెండేళ్ల బాలుడు కుశాల్ దోసె తింటుండగా.. ఒక ముక్క గొంతులో ఇరుక్కుని మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

New Update
Boy died after food piece stuck in throat

Boy died after food piece stuck in throat

ఏపీలోని అనంతపురం జిల్లా తపోవనంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దోసె ముక్క గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. 

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

ప్రాణం తీసిన దోశ

అనంతపురం నగరం తపోవనం ప్రాంతానికి చెందిన అభిషేక్, అంజినమ్మలకు రెండేళ్ల కుమారుడు కుశాల్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం కుశాల్ దోసె తింటున్నాడు. ఈ క్రమంలో దోసె ముక్క అనుకోకుండా అతని గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి ముక్కను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. 

Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

కుశాల్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో, తల్లిదండ్రులు వెంటనే సర్వజనాసుపత్రికి తరలించగా.. కొద్ది సేపటికే బాలుడు మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన తపోవనం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారులు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు నిశితంగా పర్యవేక్షించాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Also Read: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు