Vidadala Rajini : విడదల రజనికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట!

మాజీ మంత్రి  విడదల రజనికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.  ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను సూచించింది. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

New Update
vidadala rajini acb

vidadala rajini acb

మాజీ మంత్రి  విడదల రజనికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.  ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను సూచించింది. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని, విచారణకు సహకరించాలని విడదల రజనికి సూచించింది. ఇక రజనీ పీఏ రామకృష్ణకు 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు తెలిపింది. కాగా  లక్ష్మీ బాలాజీ స్టోన్స్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదు చేసింది.  ఈ కేసులో ఏ1గా రజిని ఉన్నారు.  ఈ కేసులో ఏ3గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్‌ను ఏసీబీ తాజాగా అరెస్ట్‌ చేసింది.

Also Read :  National Herald case: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్..  సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!

Also Read :  టీచర్ కాదు టార్చర్.. హోం వర్క్ చేయలేదని విద్యార్థినితో దారుణం.. లేడీ టీచర్‌కు రూ.2 లక్షల జరిమానా!

మార్చిలో కేసు నమోదు 

కాగా.. విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

Also Read : TG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

Also read : Cheap Liquor: నాశనం అయిపోతార్రా.. మరీ ఇంత మోసమా.. ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్!

 

andhra-pradesh | Vidadala Rajini | acb case on vidadala rajini

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు