Andhra Pradesh Assembly : నేడు AP బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీకి జగన్..?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా వేసి బీఏసీ మీటింగ్‌ నిర్వహించనున్నారు. 3వారాల పాటు సమావేశాలు ఉండనున్నట్లు ప్రాథమిక సమాచారం.

New Update
ap assembly

ap assembly Photograph: (ap assembly)

Andhra Pradesh Assembly : ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు వారాలపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోమవారం (ఈరోజు) ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా వేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. 

Also Read : American Airlines: ఢిల్లీకి రావాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్.. రోమ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తున్నారా అనే తెలియాల్సిఉంది.

ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 25వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28న కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అదేరోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు