/rtv/media/media_files/2025/06/25/ys-jagan-ambati-rambabu-2025-06-25-08-38-27.jpg)
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబును నియమించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అంబటి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల తర్వాత అదే నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా పని చేశారు. అయితే.. ఈ ఏడాది జనవరిలో అంబటిని ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించారు జగన్. గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని సత్తెనపల్లి సమన్వయకర్తగా నియమించారు.
ఇది కూడా చదవండి: YS Jagan Car Seized : సింగయ్య మృతిపై యాక్షన్..జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్
గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీ అంబటి రాంబాబు గారిని నియమించిన పార్టీ అధ్యక్షులు @ysjagan గారు. pic.twitter.com/636NmOdYU1
— YSR Congress Party (@YSRCParty) June 24, 2025
దీంతో అంబటిని జగన్ ఇక పూర్తిగా పక్కన పెట్టేశారన్న ప్రచారం సాగింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇక ఆయన పోటీ చేయరన్న చర్చ కూడా సాగింది. అయినా.. ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా అంబటి రాంబాబు పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా ఇటీవల జగన్ పల్నాడు జిల్లా టూర్ లో అంబటి అన్నీ తానై వ్యవహరించారు. కూటమి నేతలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు అంబటి. జగన్ పల్నాడు టూర్ కు సంబంధించి ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయనను గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా నియమించారు జగన్.
ఇది కూడా చదవండి: AP Cabinet : ముగిసిన ఎపీ క్యాబినెట్..42 అంశాలకు ఆమోదం ...బనకచర్లపై కీలక వ్యాఖ్యలు
పాత నేతలు సహకరిస్తారా?
ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మేయర్ కావటి మనోహర్ తదితరులు ఇప్పటికే ఇక్కడ ఉన్నారు. వీరంతా తమకే నియోజకవర్గ బాధ్యతలు దక్కుతాయని భావించారు. కానీ గత ఎన్నికల్లో చిలకలూరిపేటకు చెందిన విడదల రజినిని బరిలోకి దించిన జగన్.. తాజాగా అంబటిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో వీరంతా ఇప్పుడు అంబటి రాంబాబుకు సహకరిస్తారా? లేదా? అన్న అంశంపై గుంటూరు రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.