Operation Sindoor: అక్కడ కనిపిస్తే కాల్చివేయండి.. భారత్ ఆర్మీకి సంచలన ఆదేశాలు!

భద్రతా దృష్ట్యా రాజస్థాన్‌లో 1037 కిలోమీటర్లు వరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. సరిహద్దుల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే కాల్చివేయాలని ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే పంజాబ్‌లోని ఆరు ప్రాంతాల్లోని పాఠశాలలను క్లోజ్ చేశారు.

New Update
BSF to get 16 new battalions, 2 field HQs for Pakistan, Bangladesh borders

Border

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్‌తో సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో భద్రతను పెంచారు. రాజస్థాన్‌లో 1037 కిలోమీటర్లు వరకు ఉన్న పాకిస్థాన్ సరిహద్దును సీల్ చేశారు. సరిహద్దుల దగ్గర ఎవరైనా అనుమానంగా కనిపిస్తే మాత్రం వెంటనే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. జోధ్‌పుర్, బికనేర్, కిషన్‌ఘర్ విమానాశ్రయాలను మూసి వేశారు.

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

72 గంటల పాటు పాఠశాలలను..

గగనతలంలో యుద్ధవిమానాలతో గస్తీ కాస్తున్నారు. రాజస్థాన్‌తో పాటు పంజాబ్ సరిహద్దుల్లో కూడా ఇవే చర్యలు కొనసాగిస్తున్నారు. బోర్డర్‌కి ఆనుకుని ఉన్న ఆరు జిల్లాల్లోని పాఠశాలలను క్లోజ్ చేశారు. 72 గంటల పాటు ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్‌, ఫజ్లికా, అమృత్‌సర్‌, గురుదాస్‌పుర్‌, తార్న్‌ తరన్‌ ప్రాంతాల్లో స్కూల్‌లను క్లోజ్ చేశారు. వెంటనే సిబ్బంది విధుల్లోకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Mallikarjun Kharge: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు