Sharmila Vs Pawan: జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టిన షర్మిల.. సంచలన ట్వీట్!

RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఆంధ్ర మతసేనా పార్టీగా మార్చారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారన్నారు. బీజేపీ మైకం నుంచి బయట పడాలని పవన్ కు సూచించారు.

New Update
Sharmila Vs Pawan

Sharmila Vs Pawan

జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆయన నరేంద్ర మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నాడని ధ్వజమెత్తారు. జనసేన పార్టీని "ఆంధ్ర మతసేనా"  పార్టీగా మార్చారని విమర్శించారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమన్నారు.
ఇది కూడా చదవండి: Nagababu: ఇక నాగబాబు కేరాఫ్ పిఠాపురం.. అన్నకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్!

బీజేపీ మైకం నుంచి బయటపడు..

సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రరాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా జనసేన వైఖరి ఉండటం విచారకరమన్నారు. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కొని.. బీజేపీ మైకం నుంచి బయట పడాలని పవన్ కు సూచించారు. 
ఇది కూడా చదవండి: Samantha: అయ్యో.. సమంతకి ఏమైంది? హాస్పిటల్ బెడ్ పై సెలైన్ బాటిల్ తో..

Advertisment
Advertisment
తాజా కథనాలు