/rtv/media/media_files/2024/12/12/yJUhYrZ1dCTZ8UpFA8vJ.webp)
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ రోజు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి, జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి నాగేశ్వరరెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సోదాలు.. 11.20 గంల వరకు కొనసాగాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పకు మాజీ సీఎం జగన్ ఏమైనా సహాయం చేస్తున్నాడా? అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో తమ చిరునామాను హైదరాబాద్ గా పేర్కొన్నారు. అక్కడికి సంబంధించిన ఇంటి నంబర్లను, ఫ్లాట్ నంబర్లను అఫిడవిట్ లో ప్రస్తావించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ అప్డేట్స్ :
— Telugu Stride (@TeluguStride) May 7, 2025
మద్యం కుంభకోణం కేసులో అనుమానితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు.. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు.#APLiquorScam #AndhraPradesh #APHighCourt https://t.co/o6HXu92edU
అక్కడే అనుమానం..
అయితే.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కు సంబంధించి బెంగళూరులో నోటరీ చేయించారు. ఈ మధ్య ఏపీ మాజీ సీఎం జగన్ బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈంతో జగన్ వీరికి ఏమైనా సహాయం చేస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీల నుంచి సేకరించిన వేల కోట్ల రూపాయాలను బెంగళూరుకు తరలించినట్లు సిట్ చెబుతోంది. అక్కడ ఈ డబ్బును దాదాపు రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు అభియోగాలు ఉన్నాయి.
మొత్తం 2600 కోట్లు కొల్లగొట్టనట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో జగన్ దగ్గర సీఎంఓ కార్యదర్శిగా పని చేసిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను చేర్చింది సిట్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది.
(telugu-news | latest-telugu-news | telugu breaking news | jagan | ap liquor scam)