BIG BREAKING: ఐపీఎస్ సీతారామాంజనేయులుకు మరో బిగ్ షాక్.. APPSC గ్రూప్-1 కేసులో కీలక వ్యక్తి అరెస్ట్!

ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-1  పరీక్షల మూల్యాంకనం కేసు లో విజయవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు.  గ్రూప్‌-1 అక్రమాల కేసులో ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థ డైరెక్టర్‌ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Andhra Pradesh : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

APPSC group-1 case

BIG BREAKING: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-1  పరీక్షల మూల్యాంకనం కేసు లో విజయవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు.  గ్రూప్‌-1 అక్రమాల కేసులో ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థ డైరెక్టర్‌ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అందులో భాగంగా కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌లలో ఒకరైన పమిడికాలువ మధుసూదన్ ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్‌ను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మంగళవారం కూడా దర్యాప్తు కొనసాగింది. డిజిటల్ మూల్యాంకనం చేయమని మీకు ఎవరైనా చెప్పారా... లేక ప్రభుత్వంలో ఎవరితోనైనా సిఫార్సు చేయించుకున్నారా.. అని పోలీసులు ప్రశ్నించారు.

Also Read :  TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...

ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. మాన్యువల్ విధానం కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి రూ.1.14 కోట్ల తీసుకున్నాడని కామ్ సైన్ కంపెనీ డైరెక్టర్లలో మధుసూదన్ పై ఆరోపణలున్నాయి. డిజిటల్ మూల్యాంకనంకు వినియోగించిన ఎలెక్ట్రానిక్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అతడి కార్యాలయంలో మధును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు. మూల్యాంకన కుంభకోణం కేసులో మధును ఏ2గా కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.

Also read :  Indian Idol : ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ కు ఘోరప్రమాదం...పరిస్థితి విషమం

హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌లో నిర్వహించిన జవాబుపత్రాల మూల్యాంకన బాధ్యతలను నియమావళి ప్రకారం కాంట్రాక్ట్ లేదా టెండర్ ప్రక్రియ ద్వారా కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా 'కొటేషన్‌ విధానం' ద్వారా పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే 'క్యామ్‌సైన్‌' సంస్థ మరికొన్ని విభాగాల్లోనూ అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యింది.ఇందులో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయును ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చిన విషయం ఇదివరకే తెలిసిందే.

Also read :  Miss World Competition : మిస్‌ వరల్డ్‌ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?

కాగా గ్రూపు పరీక్షల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా తీవ్రమైన ఉల్లంఘనలు జరిగినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. అక్రమాల పూర్తి స్థాయిని నిర్ధారించేందుకు అన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం" అని డీఎస్పీ కె. రామకృష్ణ మీడియాకు తెలిపారు. ఈ పరిణామం ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరైన వేలాది మంది ఉద్యోగార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి, ప్రభావితమైన పరీక్ష పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also read :  సుజనా చౌదరికి తీవ్ర గాయం..హైదరాబాద్కు తరలింపు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు