AP Metro Rail Update: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లపై గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మెట్రోరైలు ప్రాజెక్టులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

New Update
Andhra Pradesh Government acquiring land for Visakhapatnam and Vijayawada metro rail projects

Andhra Pradesh Government acquiring land for Visakhapatnam and Vijayawada metro rail projects

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్ అందించింది. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

రూ.11,009 కోట్లు అవసరం

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ట్రైన్ ప్రాజెక్టుల మొదటి దశ పనుల కోసం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రెండు మెట్రో ట్రైన్ల ప్రాజెక్టుల కోసం మొదటి దశ పనులకు దాదాపు రూ.11,009 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. 

Also Read :  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

దీనికి సంబంధించిన డీపీఆర్‌లను సైతం ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అంతేకాకుండా ఈ రెండు మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు 100 శాతం నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి దరఖాస్తు పంపించారు. దీంతో ప్రస్తుతం కేంద్రం నుంచి అప్రువల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేస్తుంది. 

Also Read :  నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

భూసేకరణకు గ్రీన్ సిగ్నల్

ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టుల కోసం భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం 98 ఎకరాలు, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం 101 ఎకరాలు.

Also Read :  అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

మొత్తం 199 ఎకరాల భూమి

ఇలా మొత్తం కలిపి 199 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. భూ సేకరణకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు