/rtv/media/media_files/2025/02/23/mM9D9qciBvpPoAHvHl67.jpg)
Amaravati ORR
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. ఐదు జిల్లాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది.
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం ఉన్నటువంటి కోల్కతా-చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులు నిర్మించనున్నారు. 189.9 కిలోమీటర్ల ఓఆర్ఆర్కు ఇటీవలే ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది.
Also Read: సీఎం రేవంత్కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
ప్రస్తుతం హైదరాబాద్లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కి అనుసంధానం ఉన్నట్లుగానే చెన్నై-కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజ నుంచి తెనాలి దగ్గర్లోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం మూడు ఎలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించింది. అయితే గుంటూరు బైపస్లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు ఇందుకోసం మూడు ఎలైన్మెంట్లు సిద్ధం చేశారు.
Also Read: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!