Simhachalam Incident :  పునాది లేకుండా గోడ.. సింహాచలం ఘటనపై త్రిమెన్ కమిషన్ సంచలన రిపోర్ట్!

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు చనిపోయిన ఘటన పై సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ దుర్ఘటనపై  త్రిమెన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్‌ వెల్లడించింది.

New Update
simhachalam Chandanotsavam

simhachalam Chandanotsavam

Simhachalam Incident :  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు చనిపోయిన ఘటన పై సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ దుర్ఘటనపై  త్రిమెన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సీఎం చంద్రబాబుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కాగా తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ప్రాథమిక నివేదికలో కమిషన్‌ వెల్లడించింది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరి బరువు కారణంగా గోడ కూలినట్టు కమిషన్‌ అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

కాగా గత బుధవారం (ఏప్రిల్ 30 తేదీ) తెల్లవారుజామున భారీ వర్షానికి గోడ కూలడంతో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన పై ప్రభుత్వం మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు నివేదిక అందజేశారు.

Also read :  India vs Pakistan : భారత్‌ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్‌ మరోసారి క్షిపణి ప్రయోగం?

పునాదులు లేకుండా నిర్మించిన గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని కమిషన తన  ప్రాథమిక నివేదికలో పేర్కోంది. చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు స్పష్టం చేసింది. ప్రసాద్ స్కీమ్ లో భాగంగా గోడ నిర్మాణానికి హడావిడిగా అనుమతులిచ్చారని కమిషన్‌ పేర్కొంది.గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు లేక పోగా పునాది కూడా లేకుండా నిర్మించేశారని ప్రాథమిక నివేదికలో కమిషన్‌ పేర్కొంది. గోడ పటిష్టత గురించి గానీ, భక్తుల భద్రత గురించిగానీ ఎలాంటి తనిఖీలు చేయలేదని కమిషన్‌ తెలిపింది.

Also Read : PM Modi: ఆర్మీ సూట్‌లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
  
విశాఖ సీపీ సహా వివిధ సాక్షుల నుంచి దీనిపై స్టేట్ మెంట్లు  నమోదు చేసిన త్రిసభ్య కమిషన్ ఈ ప్రమాదానికి ఆలయ ఈఓ, ఇంజనీరింగ్ సిబ్బంది, టూరిజం కార్పోరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు బాధ్యులని కమిషన్‌ తేల్చి చెప్పింది. వీరందరిపైనా తీవ్ర చర్యలకు తిసభ్య కమిషన్‌ సిఫార్సు చేసింది.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు