Amith Shah: అమిత్‌ షాకి తృటిలో తప్పిన ప్రమాదం!

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకి తృటిలో ప్రమాదం తప్పింది. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన రథాన్ని కరెంట్‌ తీగ తాకి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది అప్రమత్తం అయ్యి కరెంట్‌ సరఫరా నిలిపివేశారు.

New Update
Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amith Shah)  కు తృటి లో పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌ (Rajasthan) లోని నాగౌర్‌(Nagour) లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచార రథాన్ని ఒక్కసారిగా విద్యుత్‌ తీగలు(Current Wires)  తాకాయి. దాంతో నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. అమిత్‌ షా బృందం బిడియాడ్‌ గ్రామం నుంచి పర్బత్‌ సర్‌ వెళ్తుంది.

ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్బత్‌ సర్‌ లో ఇరు వైపులా దుకాణాలు, ఇళ్లు ఉండడంతో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు అమిత్‌ షా ప్రచారా వాహనాన్ని తాకాయి. దీంతో కరెంట్‌ తీగ తెగి కింద పడింది. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు.

Also read: దీపావళికి ట్రైన్ లో ఉరెళ్తున్నరా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

వెంటనే అమిత్‌ షా వాహనం వెనకాల ఉన్న అన్ని వాహనాలను నిలిపివేశారు. కరెంట్‌ సరఫరాను కూడా బంద్‌ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో అమిత్ షా సహా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారం కోసం అమిత్‌ షా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా సరే రాజస్థాన్‌ లో బీజేపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న రాజస్థాన్‌ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. ప్రమాదం తప్పడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also read: క్రికెట్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌..వెయ్యేళ్లు గుర్తిండిపోయే బ్యాటింగ్‌..!

Advertisment
తాజా కథనాలు