Hyderabad : మొబైల్ ఇవ్వనందుకు దారుణ హత్య..

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న సనావుల్లా(24) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు మొబైల్ అడిగారు. అతడు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి పరారయ్యారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Murder : హైదరాబాద్‌(Hyderabad) లోని గుడిమల్కాపూర్‌లో ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది. పీవీ ఎక్స్‌ప్రేస్ వే పిల్లర్ నంబర్‌ 65 వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనావుల్లా (24) అనే వ్యక్తి రోడ్డు పక్కన వ్యాపారం(Business) చేసుకుంటున్నాడు. అతని ఇద్దరు దుండగులు వచ్చి మొబైల్ ఇవ్వాలని అడిగారు. కానీ మొబైల్ ఇచ్చేందుకు సనావుల్లా ఒప్పుకోలేదు. దీంతో వారు లాక్కునేందుకు ప్రయత్నించారు. చివరికి వాళ్ల మధ్య గొడవ జరిగింది.

Also read: మోడీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఈసీకి ఫిర్యాదు!

దీంతో ఆ దుండుగలు సనావుల్లాను కత్తితో ఛాతిపై పొడిచారు. ఆ తర్వాత మొబైల్ తీసుకోని బైక్‌పై పరారయ్యారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సీసీటీవీ దృశ్యాల(CC TV Footage) ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also read: ఖాజాగూడలో లేడీ డాన్ మాధవి అరెస్ట్

Advertisment
తాజా కథనాలు