Uttar Pradesh: నాలుగేళ్ళ బాలిక మీద అత్యాచారం...బాడీని తినేసిన కుక్కలు

ఏం చేసినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా ఆడ అయితే చాలు అన్నట్టు ఉంటున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో నాలుగేళ్ళ పాపను అత్యాచారం చేసారు దుండగులు. ఆ సంఘటనలో పాప చనిపోగా మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుని తినేసాయి.

New Update
Uttar Pradesh: నాలుగేళ్ళ బాలిక మీద అత్యాచారం...బాడీని తినేసిన కుక్కలు

ఉత్తరప్రదేశ్ లో ఫురూఖాబాద్ లో జరిగిన దారుణ సంఘటన అందరి చేత కన్నీటిని పెట్టిస్తోంది. ఫరూఖాబాద్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ళ చిన్నారి సడెన్ గా కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. వారితో పాటూ గ్రామస్థులు కూడా గాలించారు. పొలంలో ఒకచోట కుక్కలు గుంపుగా కనిపించాయి. వెళ్ళి చూస్తే బాలిక మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుతింటున్నాయి. ఆ శవం తన కూతురిదే అని తండ్రి గుర్తుపట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

బాలిక మృతి గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని శవపరీక్షలు నిర్వహించారు. అందులో చిన్నారి మీ అత్యాచారం జరిగినట్లు తేలింది. దాంతో పాటూ పాప కుటుంబంలోని ఓ యువకుడే దారుణానికి ఒడిగట్టాడని కూడా పోలీసులు తేల్చారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు అన్నీ బయటకు వచ్చాయి. తాను పొలం నుంచి తిరిగి వస్తుండగా చిన్నారి ఆడుకుంటూ కనిపించిందని నిందితుడు చెప్పాడు. మరో వ్యక్తి సాయంతో పాపను పొలంలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశామని చెప్పాడు. దీంతో యువకుడి మీద కేసు నమోదు చేశారు. ఇందులో భాగస్వామ్యం ఉన్న మరో వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. తమ కూతురిని దారుణంగా అత్యాచారం చేసి చంపిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు