Telangana : కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు.. ఎందుకంటే

కొత్తగూడం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధల్ని ఉల్లంఘించారని, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్‌లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ నేత ఎర్ర కామేష్ ఈసీకీ ఫిర్యాదు చేశారు.

Telangana : కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు.. ఎందుకంటే
New Update

CPI MLA : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) పై ఎన్నికల కేసు నమోదైంది. కొత్తగూడం(Kothagudem) ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని.. ఎన్నికల నిబంధల్ని ఉల్లంఘించారని, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్‌లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ నేత ఎర్ర కామేష్ ఈసీ(EC) కీ ఫిర్యాదు చేశారు. ఆధారతో సహా అధికారులకు వివరాలు అందించారు. ఫిర్యాదు మేరకు పాల్వంచ ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి(Vijaya Bhaskar Reddy) ఆదేశాలతో ఆయనపై పాల్పంచ పోలీసులు కేసు నమోదు చేశారు. క్షన్ 188, 171-C కింద కూనంనేనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ప్రియురాలి ఇంట్లోనే వ్యక్తి బలవన్మరణం..ఎందుకంటే?

లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మే 13న తెలంగాణ(Telangana) లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించారు.

Also Read: రూ.1,000 కోట్ల బంగారం స్వాధీనం.. ఎక్కడంటే

#cpi #telugu-news #congress #kunamneni-sambasiva-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి