రూ.350 కోసం మర్డర్ చేసిన బాలుడు.. శవం ముందే డాన్స్‌ చేస్తూ

రూ.350 కోసం ఓ బాలుడు ఒక యువకుడిని హత్య చేసిన భయంకరమైన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వెల్‌కమ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి నడిచివెళ్తున్న వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడిచేసి చంపేసిన నిందితుడు శవంముందే డ్యాన్స్ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
రూ.350 కోసం మర్డర్ చేసిన బాలుడు.. శవం ముందే డాన్స్‌ చేస్తూ

ఈ మధ్య చిన్న చిన్న అవసరాలకోసం కూడా గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు దారుణంగా మర్డర్లు చేస్తున్న సంఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. డబ్బులు, సెల్ ఫోన్లు, బంగారం వంటి తదితర విలువైన వస్తువులను దొచుకునే క్రమంలో అమాయకుల ప్రాణాలు తీసేందుకు దొంగలు వెనకాడట్లేదు. ఇలాంటి ఓ దారుణమైన ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. కేవలం మూడు వందలకోసం ఓ బాలుడు యువకుడి ప్రాణం తీసిన భయంకరమైన వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also read :అది నా అకౌంట్ కాదు.. ఎందుకు క్రియేట్ చేశారో తెలుసు.. సారా ఎమోషనల్

ఈ మేరకు ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీలో వెల్‌కమ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి కేవలం రూ.350 కోసం ఓ బాలుడు ఒక యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెల్‌కమ్‌ ప్రాంతంలో దారిన వెళుతున్న యువకుడిపై ఒక బాలుడు దాడికి దిగాడు. విచక్షణ రహింతగా అటాక్ చేసి బాధితుడికి ఊపిరాడనివ్వకుండా చేశాడు. ఈ క్రమంలోనే స్పృహ కోల్పోయిన యువకునిపై తన వద్ద ఉన్న కత్తితో దాదాపు 60 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.350 నగదు తీసుకొన్న పిల్లవాడు కొద్దిసేపు మృతదేహం దగ్గరే డాన్స్‌ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ దారుణమంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయింది. సమాచారం అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇక ఈ దారుణానికి పాల్పడిన బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తితో నిందితుడికి గతంలో ఎలాంటి పరిచయం లేదని, కేవలం డబ్బు కోసమే ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తెలినట్లు వెల్లడించారు. ఇక ఈ ఘటన వెల్‌కమ్‌ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేయగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది.

Advertisment
తాజా కథనాలు