Jammu Kashmir Terror Attack: జమ్మూకశ్మీర్లో రియాసి (Reasi) జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఈ దాడికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుపుతున్నారు. ఇదిలాఉండగా.. రియాసిలో శివ్ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణవిదేవి గుడికి బయల్దేరిన బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ విషాద ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఈ వాహనంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. 50 మంది అరెస్టు
జమ్మూకశ్మీర్లో రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఈ దాడికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Translate this News: