గాజాలో భీభత్సం సృష్టిస్తోంది ఇజ్రాయెల్. రోజూ వైమానిక దాడులతో అల్లకల్లోలం చేస్తోంది. దీంతో పాటూ యుద్ధ ట్యాంకర్లు, సైన్యం తో భూ దాడులకు కూడా సిద్ధమైపోయింది. చిన్నచిన్నగా సైన్యాన్ని గాజాలోకి పంపిస్తోంది. హమాస్ ను అంతం చేసే వరకు ఊరుకునేదే లేదు అంటోంది ఇజ్రాయెల్. హమాస్ కూడా దీనికి తగ్గట్టే ఉంది. వారు కూడా బందీలను విడిచిపెట్టడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 7,028 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇందులో 3 వేల మందికి పైగా పిల్లలు ఉన్నారు. దాడులతో గాజాలో పరిస్థితి దారుణంగా ఉంది. శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
పూర్తిగా చదవండి..Israel-Hamas conflict:ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన 50మంది బందీలు?
ఇజ్రాయెల్ - హమాస్ వార్ 21 రోజులకు చేరింది. పోరు తీవ్రం అవుతోందే తప్పా.. ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. హమాస్ ను శాశ్వతంగా నాశనం చేసే వరకు విరమించేదే లేదు అంటోంది ఇజ్రాయెల్.
Translate this News: