భారత అథ్లెట్లు దుమ్ముదులుపుతున్నారు. ప్రతీరోజు పతకాల వేట కొనసాగిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ డబుల్స్లో అమ్మాయిలు స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. కొరియా జంటను 158-159 పాయింట్లతో భారత జంట జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే లు ఓడించారు. అలాగే నిన్న భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది. ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను 62.92 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకుంది. అన్ను రాణి తన నాలుగో ప్రయత్నంలో ఈ సూపర్ త్రో విసిరింది.
పూర్తిగా చదవండి..asian games:కాంపౌండ్ ఆర్చరీలో భారత మహిళలకు గోల్డ్
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తమ మీద పెట్టుకున్న అంచనాలకు మించి రాణిస్తున్నారు అథ్లెట్లు. కొత్తగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే నిన్న పదోరోజు మొత్తంలో భారత్ కు తొమ్మిది పతకాలు వచ్చాయి. అందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి.
Translate this News: