Food Order Charges Are Getting High : ప్రస్తుతం ఫుడ్ డెలవరీ యాప్స్(Food Delivery Apps), సంస్థలకు భలే గిరాకీ ఉంది. కోవిడ్(Covid) తరువాత నుంచి ఇది మరింత పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే ఇళ్ళల్లో ఆహారం వండుకోవడం తక్కువ ఆర్డర్ పెట్టుకోవడం ఎక్కువ అయినట్టుంది పరిస్థితి. ముఖ్యంగా స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato) లకు అయితే విపరీతమైన డిమాండ్ , క్రేజ్ ఉంది. జీఎస్టీలు, డెలివరీ ఫీజు, ప్లాట్ ఫాం ఫీజు ఇలా ఎనని పెట్టినా వీటి క్రేజీ మాత్రం తగ్గడం లేదు. మెట్రో నగరాల్లో ఈ డిమాండ్ ఇంకా కాస్త ఎక్కువే ఉంది. అయితే ఈ క్రేజ్కు తగ్గట్టే ఫుడ్ డెలివరీ సంస్థలు చార్జీలు కూడా పెంచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జొమాటో మరోసారి ఛార్జీలను పెంచి వినియోగదారులకు షాక్ ఇస్తోంది.
పూర్తిగా చదవండి..Zomato : కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన జొమాటో
ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ జోమాటో బాదుడుకు సిద్ధమైంది. ఇకపై తమ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువే చెల్లించాలి అంటోంది. కొంతకాలం క్రితం జొమాటో ప్రవేశపెట్టిన ప్లాట్ ఫాం ఫీజును ఇప్పుడు మరింత పెంచేస్తోంది.
Translate this News: