Sharmila : మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది..వైఎస్ షర్మిల ట్వీట్ వైరల్.!

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వై ఎస్ షర్మిల కుమార్తె, కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేశారు. నా అద్భుతమైన పిల్లలిద్దరూ చదువులో మైలురాళ్లను అధిగమించడం చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.

Sharmila : మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది..వైఎస్ షర్మిల ట్వీట్ వైరల్.!
New Update

YS Sharmila Tweet Viral in Social Media : వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila), అనిల్ కుమార్ దంపతుల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి రెడ్డి తమ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తన సంతోషాన్ని సోషల్ మీడియా(Social Media) ద్వారా పంచుకున్నారు. తన పిల్లలు చదువులో మైలు రాళ్లను అధిగమించడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

Also read: 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. ప్రధాని మోడీ

ఎకనామిక్స్ , ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించినందుకు కుమారుడు రాజారెడ్డికి, బీబీఏ ఫైనాన్స్ డిగ్రీని సంపాదించినందుకు కుమార్తె అంజలి రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మీరు చాలా త్వరగా ఉన్నతస్థానాలకు ఎదిగారని..మీ ఇద్దరి గురించి చెప్పడం చాలా మనసుకు ఆనందంగా ఉందని అన్నారు.

publive-image

సత్యాన్ని అన్వేషిస్తూ..సమగ్రతతో కూడి జీవితాన్ని గడపాలని ఇద్దరికీ సూచించారు. సాటి మనుషుల పట్ల ఆదరణతో ఉంటూ.. మీరు ఎదగడమే కాకుండా, మీ చుట్టూ ఉన్నవారికి కూడా విలువ ఇస్తూ... వారిని కూడా ఎదిగేలా చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు షర్మిల తన బిడ్డలతో కలిసున్న ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోల్లో షర్మిల, ఆమె భర్త అనిల్, విజయమ్మ ఉన్నారు.

#social-media #ys-sharmila #ys-raja-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe