/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ys-jpg.webp)
Nara Lokesh : క్రిస్మస్(Christmas) పండుగపూట ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వాడీ వేడిగా ఉండే ప్రత్యర్థుల మధ్య అప్యాయత, అనురాగాల సంభాషణ జరిగింది. క్రిస్మస్ పండగ సందర్భంగా ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నారు. అంతేకాదు తమ మధ్య రాజకీయ వైరమే తప్పా వ్యక్తితగతంగా ఎలాంటి కక్షలు లేవని నిరూపిస్తూ వైఎస్ షర్మిల(YS Sharmila), నారా లోకేష్ లు ఇరువురి పార్టీ వర్గాలు, అభిమానులతోపాటు జనాలను ఆశ్చర్యపరిచారు.
Dear @realyssharmila Garu,
Please accept my heartfelt thanks for the wonderful Christmas gifts. Nara family wishes you and your family Merry Christmas and a Happy New Year. pic.twitter.com/4yn4SiGcjv— Lokesh Nara (@naralokesh) December 24, 2023
ఇక అసలు విషయానికొస్తే.. ఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీడీపీ(TDP) నేత నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కుటుంబానికి సైతం వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ క్రిస్మస్ స్పెషల్ గ్రీటింగ్స్ పంపించారు. ఈ మేరకు 'వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి' షర్మిలా సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన విషయాన్ని షేర్ చేసింది. అయితే దీనిపై ఆనందం వ్యక్తం చేసిన నారా లోకేష్ షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు. 'అద్భుతమైన క్రిస్మస్ కానుకలు పంపినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నారా కుటుంబం మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్, న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది' అంటూ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : Corona: పెరిగిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..!