ఉత్తరాఖండ్ లో సొరంగం మూసుకుపోవడంతో 12 రోజులుగా అందులో 41 మంది కార్మికులు చిక్కకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. లోపల ఉండిపోయిన కార్మికులు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. కానీ వారిని వీలయినంత వెంటనే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. టన్నెల్ పైన ఉన్న కొండ మీద నుంచి డ్రిల్లింగ్ చేస్తున్నారు. అక్కడ కన్నం పెట్టి దానిలోకి పెద్ద పైపం పంపించడం ద్వారా కార్మికులను బయటకు తీసుకురావాలని ప్లాన్. కానీ దేనితో అయితే సొరంగాన్ని తవ్వుతున్నారో దానికే ప్రాబ్లెమ్ రావడంతో డ్రిల్లింగ్ పనులను ఎక్కడిక్కడే ఆపేశారు. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన వేదికకు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్ను ఆపేశారు. వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్ అవదు. ఎలా పెడితే అలా డ్రిల్లింగ్ చేస్తే అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్ను ఆపేశారు.
పూర్తిగా చదవండి..Uttarakhand:ఇవాళ అయినా టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వస్తారా?
ఉత్తరాఖండ్ లోని సిల్ క్యారా టన్నెల్ లో 12 రోజులుగా చిక్కుకున్న కార్మికులకు మోక్షం లభించడం లేదు. గురువారం డ్రిల్లింగ్ పనులకు ఆటంకం కలిగింది. నిన్న అవి మొదలైనా.. కొంతసేపటికే మళ్ళీ మరోసారి సమస్య రావడంతో పనులను నిలిపేశారు.
Translate this News: