Kishan Reddy: యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు

యెన్నం శ్రీనివాస్‌ రెడ్డిపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీలో ఉంటూ.. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. అందుకే అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

New Update
Kishan Reddy: యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు

యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ మండిపడ్డారు. శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ కార్యాకలాపాలకు భంగం కలిగించాడని, అందుకే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో ఉంటూనే కార్యకర్తలను కన్ఫ్యూస్‌ చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. శ్రీనివాస్‌ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టిన బీజేపీ పార్టీపైనే అక్కసు వెళ్లగక్కుతున్నాడని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. శ్రీనివాస్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటే అని పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యెన్నం శ్రీనివాస్‌ రెడ్డిది ఒకచోట కుదురుగా ఉండే వ్యక్తిత్వం కాదన్నారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన సమయంలో ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్లు గుర్తు చేశారు.

మరోవైపు బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్‌ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే అంటున్నారని గుర్తు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని విమర్శించారు. తెలంగాణ ద్రోహులకు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌ అరాచక పాలన గురించి ప్రజలకు వివరిస్తున్నామని రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి వివరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి మారుపేరుగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చిట్టాను విప్పుతామని, వారి అవినీతి గురించి ప్రజలకు వివరిస్తామన్నారు.

యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారంటే.?

ప్రభుత్వం అర్థరాత్రి జీవో ఇచ్చిన విధంగా బీజేపీ పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్‌ చేసిందని బీజేపీ బహిష్క్రత నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీజేపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..తనకు స్పెషల్‌ లాఠీలు పోలీసులు కొత్తేంకాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇలాంటి వాటిని అనేక సార్లు ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. ప్రశ్నించే పార్టీకోసం పని చేసేవారికే అధిష్టానం నుంచి షోకాజ్‌ నోటీసులు వస్తుంటాయన్నారు. తాను పార్టీకోసం కష్టపడి పని చేశానని, పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోతే ప్రశ్నించినట్లు వెల్లడించారు.

2014వ సంవత్సరం రాజ్యసభలో బీజేపీ పార్టీ తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని చూసిందని శ్రీనివాస్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీలు గతంలో తెలంగాణ బిల్లును బొందపెట్టాలని చూశారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. 2014లో బీజేపీ పార్టీ తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని కుట్ర పన్నితే కిషన్‌ రెడ్డి మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాల్సింది పోయి.. హైదరాబాద్‌కు వచ్చి పడుకున్నాడని విమర్శించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలు ఎవరూ తెలంగాణ బిల్లు కోసం పోరాటం చేయలేదని, తెలంగాణ బిల్లు విషయంలో వెంకయ్య నాయుడిని ప్రశ్నించిన ఘనత తమదన్నారు.

బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ మెరుగ్గా పనిచేశాడని శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ సారధ్యంలో రాష్ట్రంలో 22 శాతానికి బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. బండి సంజయ్‌ అధ్యక్ష బాధ్యతకు సంబంధించిన పదవికాలం పూర్తియిన అనంతరం పార్టీ అధిష్టానంతో మాట్లాడానన్న ఆయన.. అధ్యక్ష పదవి అందరికీ తెలిసిన నేతకు అప్పగించాలని కోరినట్లు తెలిపారు. ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇచ్చివుంటే బాగుండేదన్న ఆయన.. తమ అభిప్రాయాన్ని ఢిల్లీ వెళ్లి పెద్దలకు చెప్పామన్నారు. అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి, బై పోల్‌లో విజయం సాధించిన వ్యక్తికి ఇవ్వకుండా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డికి ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. మరోవైపు బండి సంజయ్‌ సారధ్యంలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతంగా ఉండగా.. కిషన్‌ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక 12 శాతానికి పడిపోయిందని యెన్నం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు