MP VSR: తెలంగాణ ఓటర్స్‌కు ఏపీలో ఓటు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ కొత్త బిజినెస్ చేస్తుందని ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ సమయాన్ని టీడీపీ వృధా చేస్తుందని పేర్కొన్నారు. ఒక యాప్ తో ఓటర్ల డేటాను టీడీపీ కొల్లగొడుతుందని అన్నారు.

New Update
Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత

MP Vijaya Sai Reddy: టీడీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తమ ప్రభుత్వం దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సహా ఉన్నతాధికారులను కలిశామని అన్నారు. టీడీపీ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ "మై పార్టీ డాష్ బోర్డ్" యాప్ ద్వారా ప్రజల కుల, మత, వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అనే విషయాన్ని ఈసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చాం అని అన్నారు. ఈ డాటాను అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సర్వర్ లో భద్రపరుస్తున్నారని పేర్కొన్నారు.

ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!

సేవా మిత్ర పేరుతో గతంలో ఇలాగే డేటా సేకరించారు. వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక వ్యక్తి కులాన్ని తెలుసుకోవడం ద్వారా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోడల్ కోడ్ ఉల్లంఘించేలా అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని అన్నారు. ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ప్రతి 30 ఇళ్లకు ఒక టీడీపీ కార్యకర్తను నియమిస్తున్నారని తెలిపారు. ఆ కార్యకర్త మేనిఫెస్టో రూపొందించే కసరత్తు ఆ 30 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి లండన్ సర్వర్ లో భద్రపరుస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ అధికారిగా లేక ఎన్నికల కమిషన్ అధికారిగా ప్రజలను మభ్యపెడుతూ వివరాలు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తమ ఓటర్లు కాదు అనుకుంటే వారి ఓట్లు తొలగించేలా తప్పుడు దరఖాస్తులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బాబు ష్యూరిటీ పేరుతో ఆ కుటుంబాలకు హామీ కార్డులు ఇస్తున్నారని పేర్కొన్నారు. అలాగే దొంగ ఓట్లు కూడా చేర్చుతున్నారు. ఒక పేరులో స్పెల్లింగ్ కాస్త మార్చి మరలా మరలా పేర్లు నమోదు చేస్తున్నారని అన్నారు.

ALSO READ: కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్…కేటీఆర్ ఆన్ ఫైర్!

అలాగే తెలంగాణలో నివసిస్తున్న వారి పేర్లను కూడా ఇక్కడ చేర్చుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఓటర్స్ ఏపీలో ఓటు వేయించేలా ఒక డ్రైవ్ నిర్వహించే ప్రయత్నం టీడీపీ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ సురేష్ కోనేరు పేరిట ఒక ఫిర్యాదు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఒక 10 లక్షల ఓటర్లు నకిలీ ఓటర్లు అంటూ పేర్కొన్నారు. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు వెరిఫై చేసి 1-2% తేడాలు మినహా అంతా కరెక్ట్ అని తేల్చారు అని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్నికల సంఘం అధికారుల సమయాన్ని వృధా చేసేలా తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు