Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రానున్న 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా హెచ్చరించింది. మే 18 ఆదివారం రోజు బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైంది. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
మునిగిన బెంగళూర్
మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డ్ లో ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించాయి. దీంతో కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. భారీ వర్షంతో అనిల్ కుంబ్లే జంక్షన్ నుంచి BRV జంక్షన్ వరకు, బేలిమఠ జంక్షన్ నుంచి బిన్నీమిల్ దిశగా భారీ ట్రాఫిక్ ఏర్పడింది.
#Bengaluru turns into #GreaterBangalore a couple of days ago! The vision of #dkshivakumar turns into reality last night! Traffic jams, water logging, submerging vehicles... #BengaluruRains #BangaloreRains @Shehzad_Ind please take this up at the national level! pic.twitter.com/G2HVB7JsdU
— Abinash Ganesh (@youdle) May 19, 2025
బెంగళూరుకు ఎల్లో అలర్ట్
బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ‘యెల్లో అలర్ట్’ ప్రకటించింది. మే 22 వరకు ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు ప్రయాణించవద్దని సూచించింది.
ಮುಂದಿನ 7 ದಿನಗಳ #ಹವಾಮಾನ #ಮುನ್ಸೂಚನೆ ಮತ್ತು #ಎಚ್ಚರಿಕೆಗಳು: (ಮೂಲ: IMD)
— Karnataka State Natural Disaster Monitoring Centre (@KarnatakaSNDMC) May 19, 2025
ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಅಲ್ಲಲ್ಲಿ ಗುಡುಗು, ಮಿಂಚು ಸಹಿತ ಕರಾವಳಿ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಚದುರಿದಿಂದ ವ್ಯಾಪಕವಾಗಿ ಸಾಧಾರಣ ಮಳೆ ಹಾಗೂ ಅಲ್ಲಲ್ಲಿ ಭಾರಿ ಮಳೆ, ದಕ್ಷಿಣ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಇಂದು ಮತ್ತು ನಾಳೆ, ಉತ್ತರ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಮೇ 19 ರಿಂದ 22 ರವರೆಗೆ ಹಾಗೂ pic.twitter.com/OHLsQQ5j6d
rain-alert | Bengaluru rains | latest-news | telugu-news | weather-update