Ramoji Film City: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రమాదం.. ఒకరు మృతి..

రామోజీ ఫిల్మ్‌ సిటీలో లైమ్లైట్‌ గార్డెన్‌ వద్ద ఫిల్మ్ సిటీ విస్టెక్స్‌ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా మృతి చెందారు. ఆ కంపెనీ చైర్మన్ విశ్వనాథన్‌రాజుకు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.

Ramoji Film City: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రమాదం.. ఒకరు మృతి..
New Update

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. లైమ్లైట్‌ గార్డెన్‌ వద్ద ఫిల్మ్ సిటీ విస్టెక్స్‌ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే చనిపోయింది విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇక కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also read: ఆంధ్రాలో కులగణన ప్రారంభం

విశ్వనాథరాజు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్‌లో పోలీసులు కేసు నమోదుచేశారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ మెనేజ్‌మెంట్‌ను నిందితుడిగా చేర్చారు. జానకీరాం రాజు అనే ప్రైవేటు ఉద్యోగి ఈ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: వీడిన వికారాబాద్ మర్డర్ మిస్టరీ..వెలుగులోకి సంచలన విషయాలు

#telugu-news #ramojirao #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe