రూ. కోటి లాటరీ వస్తే... ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?

ఓ మహిళను అదృష్టం వరించింది. కానీ ఆమె మానవత్వం చాటుకుంది. వర్జీనియాకు చెందిన క్యారీ ఎడ్వర్డ్స్ అనే మహిళ రూ.కోటి లాటరీ గెలిచుకుంది. అయితే ఆ మొత్తాన్ని తన కోసం కాకుండా మూడు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చింది.

New Update
US Woman Wins

ఓ మహిళను అదృష్టం వరించింది. కానీ ఆమె మానవత్వం చాటుకుంది. వర్జీనియాకు చెందిన క్యారీ ఎడ్వర్డ్స్ అనే మహిళ రూ.కోటి లాటరీ గెలిచుకుంది. అయితే ఆ మొత్తాన్ని తన కోసం కాకుండా మూడు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయానికి అందరూ షాక్ అయ్యారు. క్యారీ ఎడ్వర్డ్స్ సెప్టెంబర్ 8న వర్జీనియా లాటరీలో $150,000 (సుమారు రూ. 1.3 కోట్లు) గెలుచుకున్నారు. చాలా మంది లాటరీ గెలిస్తే తమ సొంతానికి వాడుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగిస్తారు. కానీ, క్యారీ తన లాటరీ డబ్బు మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తాను గెలిచిన వెంటనే తీసుకున్నానని ఆమె చెప్పారు.

ఈ $150,000 బహుమతిని క్యారీ మూడు స్వచ్ఛంద సంస్థలకు చెరో $50,000 చొప్పున పంచారు. ఆమె మొదటి విరాళాన్ని "అసోసియేషన్ ఫర్ ఫ్రంటోటెంపోరల్ డిజనరేషన్ (AFTD)" అనే సంస్థకు ఇచ్చారు. ఇది ఆమె చనిపోయిన భర్త స్టీవ్ గౌరవార్థం ఇచ్చారు. ఆమె భర్త స్టీవ్ కూడా ఇదే వ్యాధితో బాధపడ్డారు.

రెండవ విరాళాన్ని రిచ్‌మండ్‌లోని "షాలమ్ ఫార్మ్స్" అనే ఛారిటబుల్ సంస్థకు ఇచ్చారు. క్యారీ స్వయంగా ఈ సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తారు.

మూడవ విరాళాన్ని "నేవీ-మెరైన్ కార్ప్స్ రిలీఫ్ సొసైటీ"కి ఇచ్చారు. ఈ సంస్థ సైనిక కుటుంబాలకు ఆర్థిక, విద్యా సంబంధ సహాయం అందిస్తుంది.

క్యారీ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, తాను దేవుని దయతో ఆ డబ్బు గెలుచుకున్నానని, దాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలని చెప్పారు. ఆమె ఈ నిర్ణయం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. లాటరీ గెలిచినవారు కూడా ఇలాంటి మంచి పనులు చేయవచ్చని ఆమె ఈ కథతో నిరూపించారు. ఆమె చేసిన ఈ దాతృత్వం సమాజంలో మంచి మార్పు తీసుకొస్తుందని ఆమె ఆశిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు