Vinesh Phogat: ఏడాది క్రితం ఆమెను రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళారు. పోలీసులతో దెబ్బలు పడింది. న్యాయం కోసం రోడ్ల మీద ధర్నా చేసింది. అరెస్ట్ అయింది. వేధింపులకు గురైంది. దీంతో కెరీర్ ఖతం అయిపోయిందనుకున్నారు. విద్వేషకారులు విషం చిమ్ముతున్నా తన పోరాటం ఆపలేదు. వెనుకడుగు వేయలేదు. సహచరులకు జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూనే.. తన పంచ్లకు పదును పెట్టుకుంది. తప్పు చేసిన వారి తలలు దించుకునేలా పట్టుదలతో ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరుకుంది వినేశ్ ఫోగట్.
పూర్తిగా చదవండి..Paris Olympics: గురి చూసి దెబ్బ కొట్టింది.. అన్యాయాన్ని ఆటతో మడత పెట్టేసింది!
పారిస్లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ విసిరిన పంచ్ ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను రోడ్డు మీదకు ఈడ్చిన వారి చెంప చెళ్ళుమనిపించేలా ఒలింపిక్స్లో పతకం ఖాయం చేసుకుంది. మొట్టమొదటిసారి రెజ్లింగ్లో భారత్ నుంచి ఫైనల్స్కు వెళ్లిన ఫొగట్ కొత్త చరిత్రను లిఖించింది.
Translate this News: