Watch Video: రైల్వే ట్రాక్ మధ్యలో వంట చేసుకుంటున్నారు.. చివరికి ముంబయిలోని మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్కు దగ్గర్లో రైల్వే ట్రాక్పై కొందరు వంట వండుతున్న వీడియో వైరల్ కావడంతో దానిపై రైల్వే శాఖ స్పందించింది. వాళ్లందరూ యాచకులని.. అక్కడి నుంచి వాళ్లని ఖాళీ చేయించామని.. ఇలాంటివి జరగకుండా సిబ్బందికి ఆదేశించామని చెప్పింది. By B Aravind 27 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి సోషల్ మీడియాలో నిత్యం కొత్త కొత్త వీడియోలు వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని విచిత్రంగాను, వింతగాను ఉంటాయి. అయితే తాజాగా కొందరు రైల్వే ట్రాక్పై వంట వండుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ముంబయిలోని మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్కు దగ్గర్లో కొందరు పట్టాలపై కూర్చోని వంట చేసుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ ట్రాక్ మధ్యలో స్టవ్ పెట్టి భోజనం తయారుచేస్తుండగా.. కొందరు బాలికలు పక్కన చదువుకుంటున్నారు. Also Read: మరో 70రోజుల్లో ఎన్నికలు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు ఇది ప్రమాదకరం ఇక కొందరు చిన్నారులు పట్టాలపై ఆడుకుంటుండగా.. మరో ఇద్దరు నిద్రపోతున్నారు. జనవరి 24న పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటీజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. అసలు ఇలా ట్రాక్ మధ్యలో వంట వండుకోవడం, చదువుకోవడం, ఆడుకోవడం ప్రమాదకరమని చెబుతున్నారు. వెంటనే దీనిపై రైల్వే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. వాళ్లు యాచకులు అయితే వీడియో చివరికి రైల్వేశాఖ కంటపడింది. దీనిపై పశ్చిమ రైల్వే అధికారులు స్పందించారు. ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని.. ఈ ఘటనపై తీసుకున్నామని చెప్పారు. అయితే వాళ్లందరూ యాచకులని.. అక్కడి నుంచి ఖాళీ చేయించామని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. Also Read: మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరించిన చాట్ జీపీటీ.. #national-news #telugu-news #railway-track #mumbai సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి