ఆమెకు 30.. అతనికి 26.. కట్ చేస్తే అడవిలో మరో వ్యక్తి మృతదేహం.. సినిమాను మించిన ట్విస్ట్‌లు..

ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమం సంబంధం పెట్టుకున్న మహిళ.. తన భర్తను ప్రియుడిలో కలిసి చంపించింది. ఈ దారుణం యూపీలో సోన్ భద్ర జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని అడవిలో పడేసింది.

New Update
ఆమెకు 30.. అతనికి 26.. కట్ చేస్తే అడవిలో మరో వ్యక్తి మృతదేహం.. సినిమాను మించిన ట్విస్ట్‌లు..

Uttar Pradesh: ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి(Marriage) విలువలు లేకుండా పోతున్నాయి. ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లి చేసుకోవడం.. పెళ్లి తరువాత ఇంకొకరితో వివాహేతర సంబంధం(Illegal Relationship) పెట్టుకోవడం.. చివరకు ఆ మోజులో వివాహ బంధాన్ని తెంచుకోవడం లేదంటే.. భాగస్వామిని హత్య చేయడం జరుగుతోంది. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా నిత్యం చాలా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన యువకుడితో ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం కాస్తా.. ఆమె భర్త ప్రాణాలను హరించేలా చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇదికూడా చదవండి: Gold Rates Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన ప్రేమ్ మోహన్ ఖర్వర్ స్థానికంగా రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఇతనికి పొరుగూరుకు చెందిన మహిళతో పదేళ్ల క్రితమే వివహం జరిగింది. అయితే, ఈ దంపతుల మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ప్రేమ భార్యకు ఓ యువకుడితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా అక్రమ బంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో ఆ యువకుడు రావడం, వీరిద్దరూ రహస్యంగా కలుసుకోవడం జరుగుతుండేది. అయితే, ఈ క్రమంలోనే ఓ రోజులు మహిళ తన ప్రియుడితో బెడ్‌రూమ్‌లో రొమాన్స్ చేస్తుండగా.. ప్రేమ్ సడెన్‌గా చూశాడు. దాంతో ఆగ్రహించిన ప్రేమ్.. ఆమెను విపరీతంగా కొట్టాడు. వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాడు. కొద్ది రోజుల తరువాత మళ్లీ అదే సీన్ ప్రేమ కంట పడింది. ఈసారి ఇష్టారీతిని తన భార్యను కొట్టాడు. అయితే, విషయాన్ని ప్రేమ భార్య తన ప్రియుడితో చెప్పింది. ఇద్దరి బంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రేమ్‌ను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు.

ప్రేమ్‌ను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. కొంత మంది వ్యక్తులతో కలిసి అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రేమ్‌ను చంపేశారు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పారేసి వచ్చారు. అయితే, పశువుల కాపరులు, స్థానికులు ఆ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి హత్యగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ్‌ను చంపింది అతని భార్య, ఆమె ప్రియుడేనని తేల్చారు పోలీసులు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదికూడా చదవండి: మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..

Advertisment
తాజా కథనాలు