Bandi Sanjay : ఆప్యాయ ఆలింగనం.. చిరంజీవిని కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పద్మభూషణ్ చిరంజీవిని కలిశారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి సంజయ్ కి శాలువా కప్పి సత్కరించారు చిరు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఒకరినొకరు కొనియాడారు.

New Update
Bandi Sanjay : ఆప్యాయ ఆలింగనం.. చిరంజీవిని కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్!

Hyderabad : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పద్మభూషణ్ (Padma Bhushan), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ని కలిశారు. కొద్దిసేపటి క్రితం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తీసుకుని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘సంజయ్ గారు... మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్ లభించింది’ అని ఈ సందర్భంగా చిరంజీవి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ (PM Modi) తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు.

publive-image

ఇక బండి సంజయ్ స్పందిస్తూ ‘నేను విద్యార్ధి దశలో మీ సినిమాలకు అభిమానిని' అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురు దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

publive-image

publive-image

publive-image

Also Read : బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుంది.. హాట్ కేక్ అంటూ పెళ్లిపై శ్రీ రెడ్డి క్లారిటీ!

Advertisment
తాజా కథనాలు