/rtv/media/media_files/2025/03/20/lfWfaoQ2VcuOtuSYKwmJ.jpg)
Family Suicide: రాజస్థాన్లో దారుణం జరిగింది. ఒక వ్యాపారవేత్త ఇంట్లో ముగ్గురు చనిపోయారు. వ్యాపారవేత్త నితిన్ ఖత్రి మొదట తన భార్య రజని,18 ఏళ్ల కుమార్తె జెస్సికాను హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకుని మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు దాదాపు 15 రోజులుగా ఇంట్లోనే ఉన్నాయని.. ఇంటి నుండి దుర్వాసన వస్తోందని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో పోలీసులకు సమాచారం అందింది.
Also Read : అడుక్కోవడం ఎందుకు.. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
పోస్ట్ మార్టం కోసం పంపించాం
నితిన్ ఉరి వేసుకుని, అతని భార్య, కుమార్తె మృతదేహాలు నేలపై పడి ఉన్నట్లుగా కనుగొన్నామని డిప్యూటీ ఎస్పీ విశాల్ జాంగిద్ అన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపించామని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో నితిన్ తన భార్య, కుమార్తెను చంపి ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత వీరి మృతికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని విశాల్ జాంగిద్ అన్నారు.
నితిన్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు అమ్మేవాడు. అతని భార్య అతనికి షాపులో సహాయం చేసేది. వారి కుమార్తె కామర్స్ విద్యార్థిని. వారి వ్యాపారం బాగానే జరుగుతోందని,వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని పొరుగువారు పోలీసులకు తెలిపారు. పోలీసులు కుటుంబ బంధువులకు సమాచారం అందించి, పొరుగువారిని, కుటుంబానికి దగ్గరగా ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు.
Also Read : చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్.. డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్లు!