TSRTC Special Buses For Inter Students: రేపటి నుంచి ( బుధవారం ఫిబ్రవరి 28) జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించిన అధికారులు… పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.పరీక్షల నిర్వహణలో భాగంగా ఇంటర్మీడియేట్ జిల్లా పరీక్షల విభాగం, హైపవర్ కమిటీతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు పాల్గొననున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, అధికారులు కూడా సెల్ఫోన్లు తీసుకెళ్లవద్దని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రం దగ్గర విద్యార్థులకోసం అన్ని వసతులను కల్పించే ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీటిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు ఇంటర్మిడియేట్ బోర్డు తెలిపింది.
పూర్తిగా చదవండి..TSRTC : విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు..!
రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు వెల్లడించారు.
Translate this News: