GUNTURU KAARAM: సంక్రాంతి సినిమాల ఘాటు మాములుగా లేదు.భారీ బడ్జెట్ తో తెరకెక్కించి వసూళ్ళు రాబట్టుకోవడంలో ఈ సీజన్ కు మించిన సీజన్ లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆరంభంలో సంక్రాతికి సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్;లో తెరకెక్కి అత్యధిక సినిమాహాళ్ళలో రిలిజవుతున్న గుంటూరు కారం సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్ని ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేసినా సరే . మొదటి మూడు రోజుల వసూళ్ళు చాలా కీలకం. ఈ మూవీ చాలా పెద్ద సినిమా కాబట్టి టికెట్స్ ధరలతో పాటు , షో లు సైతం పెంచాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలి.
పూర్తిగా చదవండి..రోజుకు 6 ఆటలు .. టికెట్స్ ధరలు పెంపుకై గ్రీన్ సిగ్నల్
మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు రోజుకు 6 షోలు, టికెట్ రేట్ పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: