పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మేం చెబుతుంటే.. బీఆరెస్ మాపై విష ప్రచారానికి దిగిందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా విడుదల చేయాలి.ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్దిష్టమైన డిమాండ్ అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఈసీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుంది.సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నవంబర్ 2లోగా అన్ని పూర్తి చేయాలని చెప్పామన్నారు.కాంగ్రెస్ ను బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారు. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారు.కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారనివారిని వెంటనే తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు. అంజనీ కుమార్ ను, స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని స్పష్టంగా చెప్పాం. రిటైర్ అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పామని అన్నారు రేవంత్ రెడ్డి.
పూర్తిగా చదవండి..TPCC press meet:ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్
సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నవంబర్ 2లోగా అన్ని పూర్తి చేయాలని చెప్పామన్నారు. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారు.కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారనివారిని వెంటనే తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
Translate this News: