Andhra Pradesh: దారుణం.. వాగులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవం మండలం ఐ.పొలవరంలో విషాదం జరిగింది. ముగ్గురు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీతపల్లి అనే వాగులో స్నానానికి దిగగా.. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయి మృతి చెందారు. మృతులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.

Andhra Pradesh: దారుణం.. వాగులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి
New Update

ఆంధ్రప్రదేశ్‌లోని.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవం మండలం ఐ.పొలవరంలో విషాదం జరిగింది. ముగ్గురు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీతపల్లి అనే వాగులో స్నానానికి దిగారు. కానీ ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయి మృతి చెందారు. మృతులు తూర్పు గోదావరి జిల్లా గోవడం మండలం కె.ఎర్రంపాలెం వాసులుగా గుర్తించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదు: ఎమ్మెల్యే బాలినేని

ఎర్రంపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఈ మధ్య చాలామంది యువకులు చెరువుల్లో, కాలువల్లో స్నానం చేసేందుకు వెళ్లి అందులో గల్లంతై చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

Also Read: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి

#telugu-news #crime-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe