Stock Market Crash : ఒక్క భయం.. 15 లక్షల కోట్ల ఆవిరి.. స్టాక్ మార్కెట్ పతనంతో భారీ నష్టం!

స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే కనిపించింది. భారీ పతనంతో ఇన్వెస్టర్స్ ఒక్కరోజులోనే 15 లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అమెరికాలో మాంద్యం భయం కనిపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు  

Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!
New Update

Stock Market Crash On Monday : స్టాక్ మార్కెట్లో (Stock Market) సోమవారం భారీ విధ్వంసం కనిపించింది. దాదాపు నెలరోజుల తరువాత ఒక్కసారిగా వచ్చిన ఈ కుదుపుతో ఇన్వెస్టర్లు విపరీతమై నష్టాలను చూడాల్సి వచ్చింది. స్టాక్ మార్కెట్‌లో మాంద్యం కనిపిస్తోందన్న భయంతో ఇన్వెస్టర్లు రూ.15 లక్షల కోట్లు నష్టపోయారు

సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం ఒక శాతానికి పైగా పడిపోయాయి. ఈ విధంగా, గత రెండు ట్రేడింగ్ సెషన్లలో రెండు ప్రామాణిక ఇండెక్స్ లు  దాదాపు నాలుగు శాతం క్షీణించాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.441.84 లక్షల కోట్లకు తగ్గింది.

సోమవారం, స్థానిక స్టాక్ మార్కెట్లలో భారీ పతనం - BSE సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా పడిపోయింది. అలాగే, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీలో కూడా 662 పాయింట్ల పెద్ద పతనం కనిపించింది.  ప్రపంచంలోని ఇతర దేశాల స్టాక్ మార్కెట్లలో పతనం తరువాత.. IT, మెటల్ .. చమురు .. గ్యాస్ బ్యాంక్‌ స్టాక్స్ లో ఆల్ రౌండ్ అమ్మకాల కారణంగా మార్కెట్ పడిపోయింది.. ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.15 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. స్టాక్ మార్కెట్ క్షీణించడం ఇది వరుసగా రెండో సెషన్. అంతకు ముందు వారాంతం శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్ పతనాన్ని చూసింది. స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి గణాంకాలు కనిపించాయో ఒక సారి చూద్దాం. 

సెన్సెక్స్, నిఫ్టీల్లో రికార్డు పతనం

Stock Market Crash : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,222.55 పాయింట్లు లేదా 2.74 శాతం క్షీణించి, నెల రోజుల కనిష్ట స్థాయి 78,759.40 పాయింట్ల వద్ద ముగిసింది. జూన్ 4, 2024 తర్వాత ఒక్క రోజులో మార్కెట్‌లో ఇదే అతిపెద్ద పతనం. ఆ రోజు 2,686.09 పాయింట్లు పతనమై 78,295.86 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 662.10 పాయింట్లు లేదా 2.68 శాతం క్షీణతతో 24,055.60 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 824 పాయింట్లు పతనమై 23,893.70 పాయింట్లకు చేరుకుంది. జూన్ 4 తర్వాత నిఫ్టీలో కూడా ఇదే అతిపెద్ద సింగిల్ డే పతనం. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రోజు మార్కెట్ ఐదు శాతానికి పైగా పడిపోయింది.

ఇన్వెస్టర్లు ఎంత నష్టపోయారు?

సెన్సెక్స్, నిఫ్టీలు (Nifty) శుక్రవారం ఒక శాతానికి పైగా పడిపోయాయి. ఈ విధంగా, గత రెండు ట్రేడింగ్ సెషన్లలో రెండు ప్రామాణిక ఇండెక్స్ లు దాదాపు నాలుగు శాతం క్షీణించాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.441.84 లక్షల కోట్లకు క్షీణించింది. శుక్రవారం ఇన్వెస్టర్లు రూ.4.46 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఇలా రెండు రోజుల్లో రూ.19 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అయితే, సోమవారం ఒక్కరోజే బీఎస్ఈ మార్కెట్ క్యాప్‌లో రూ.15 లక్షల కోట్లకు పైగా నష్టం వచ్చింది.

నష్టపోయిన.. లాభపడిన షేర్లు ఇవే.. 

చిన్న కంపెనీల షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.21 శాతం, మీడియం కంపెనీల షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.60 శాతం పడిపోయాయి. సెన్సెక్స్ షేర్లలో టాటా మోటార్స్ ఏడు శాతానికి పైగా పడిపోయింది. దీంతో పాటు అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ కూడా గణనీయంగా క్షీణించాయి. అయితే హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే షేర్లు మాత్రం లాభాల్లోనే ఉన్నాయి.

విదేశీ మార్కెట్లలో భారీ పతనం

ప్రపంచవ్యాప్తంగా, విశ్లేషకుల ప్రకారం, జపాన్‌లోని నిక్కీ 12 శాతానికి పైగా పడిపోయింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ఆసియాలోని ఇతర మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, చైనా షాంఘై కాంపోజిట్ .. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సోమవారం 12.4 శాతం పడిపోయాయి. ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనించవచ్చన్న భయం ఇన్వెస్టర్లలో ఉండటమే ఇందుకు కారణం. శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, అమెరికాలోని కంపెనీల్లో నియామకాలు గత నెలలో ఊహించిన దానికంటే నెమ్మదిగా నమోదయ్యాయి.

సోమవారం జపాన్ నిక్కీ 4,451.28 పాయింట్లు పతనమై 31,458.42 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం 5.8 శాతం పడిపోయింది. ఓవరాల్ గా చూస్తే రెండు రోజుల్లోనే ఇప్పటి వరకు భారీ క్షీణత నమోదైంది. అంతకుముందు, అక్టోబర్ 19, 1987న 3,836 పాయింట్లు లేదా 14.9 శాతం పడిపోయింది. ఆ సమయంలో గ్లోబల్ మార్కెట్ల పతనానికి బ్లాక్ మండే అని పేరు పెట్టారు. యూరోపియన్ మార్కెట్లలో ట్రేడింగ్ సమయంలో భారీ క్షీణత కనిపించింది. శుక్రవారం అమెరికా మార్కెట్‌లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

నిపుణులు ఏమి చెబుతున్నారు.. 

సెబీ (SEBI) సర్టిఫైడ్ ఎనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ ఆర్టీవీతో మాట్లాడుతూ..  యుఎస్‌లో నిరాశాజనకమైన ఉపాధి గణాంకాల కారణంగా, పెట్టుబడిదారులు మాంద్యం భయం .. యెన్ మారకపు రేటు గణనీయంగా పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారన్నారు.  అంటే వారు ఇతర ప్రాపర్టీస్ పై  పెట్టుబడి పెట్టడం మానేస్తారని అన్నారు. దేశాలు క్యారీ ట్రేడ్‌ను తీసుకోవడం ద్వారా అంటే తక్కువ ధరలకు రుణాలు తీసుకోవడం ద్వారా ప్రపంచ మార్కెట్‌లలో జాగ్రత్తగా ఉండాలనే  వైఖరితో బలమైన తగ్గుదల ఉందని చెప్పారు.  స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం శుక్రవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,310 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

అలాగే ప్రపంచ మార్కెట్లలో బేరిష్ పోకడలు కనిపిస్తున్నాయని అనిల్ కుమార్ అన్నారు. జపాన్‌లో వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా యెన్ క్యారీ ట్రేడ్ పరిస్థితి తిరగబడుతుందనే భయం మార్కెట్ పతనానికి ప్రారంభ కారణం అని ఆయన చెప్పారు.  అమెరికాలో ఉపాధి గణాంకాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మాంద్యం అవకాశాన్ని పెంచింది. వీటన్నింటితో మార్కెట్‌ సెంటిమెంట్‌ ప్రభావితమైందంటూ ఆయన వివరించారు. 

ఇక ఈవారంలో స్టాక్ మార్కెట్ దాదాపుగా ఇదేతీరులో ఉండే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడటం.. దేశీయంగా ఆర్బీఐ రేపో రేటుపై తీసుకునే నిర్ణయాలు మార్కెట్ పోకడను నిర్దేశిస్తాయని డాక్టర్ అనిల్ కుమార్ అంటున్నారు.

Also Read : ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేద్కర్ పిటిషన్

#nse #stock-market-news #sebi #bse #stock-market
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి