Medigadda: తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (vikramarka)తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరీశీలించడానికి వెళ్లనున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ మొదలవగానే 10.15 వరకు సభలో పాల్గొన్న అనంతరం నేరుగా బస్సుల్లో మేడిగడ్డకు బయలుదరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుని రెండు గంటలపాటు సైట్ విజిట్, పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఉంటుందని అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Telangana: అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు.. 40 బస్సులు, 3 వేల మంది!
తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించేందుకు సిద్ధమైంది. ఉదయం సభలో పాల్గొన్న అనంతరం నేరుగా 40 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. 3వేల మంది కూర్చునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
Translate this News: