Ap: చంద్రగిరి కూచివారిపల్లిలో ఘర్షణలు

తిరుపతిలోని చంద్రగిరి కూచివారిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ సరళిని పరిశీలన కోసం వెళ్లిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు.గ్రామానికి రావద్దంటూ కాన్వాయ్ లోని వాహనానికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టాయి.

Ap: చంద్రగిరి కూచివారిపల్లిలో ఘర్షణలు
New Update

AP: ఏపీలో సోమవారం ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్ని ప్రదేశాల్లో కూడా ప్రశాంతంగానే పోలింగ్‌ జరిగినట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని చంద్రగిరి కూచివారిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ సరళిని పరిశీలన కోసం వెళ్లిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు.

గ్రామానికి రావద్దంటూ కాన్వాయ్ లోని వాహనానికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టాయి. ఇరు పార్టీల నేతలు కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు.దీంతో కూచివారిపల్లికి పోలీసులు భారీగా తరలి వచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also read: బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ కన్నుమూత!

#tirupati #ycp #tdp #politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి