/rtv/media/media_files/2025/02/21/AEwk9LJPInhwj78W4hgP.jpg)
KCR With Temple Priests
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మహా కుంభాభిషేకం కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 23న స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ పూజారులు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అలాగే మార్చి1 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సైతం హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
/rtv/media/media_files/2025/02/21/AEwk9LJPInhwj78W4hgP.jpg)
Also Read: అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టా.. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు: ఏక్నాథ్ షిండే
ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో కేసీఆర్కు ఆశీర్వచనం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈఓ భాస్కర్, ముఖ్య అర్చకులు నరసింహ మూర్తి, కిరణ్ కుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి కేసీఆర్ గారికి ఆహ్వానం
— BRS Party (@BRSparty) February 21, 2025
అనంతరం జరిగే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా పూజారుల ఆహ్వానం.
• నాటి కేసీఆర్ ప్రభుత్వ పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం… pic.twitter.com/GfkBk6Y4WT
Also Read: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!