/rtv/media/media_files/2025/06/22/minister-konda-surekha-husband-2025-06-22-12-16-10.jpg)
మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళి తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కొండా దంపతులకు వార్నింగ్ ఇస్తున్నారు. కొండా సురేఖ దంపతులపై పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
వివాదాస్పదంగా మారిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ అధిష్ఠానానికి కంప్లైట్ ఇచ్చారట. కొండా మురళి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్లు పదవులకు రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లు.. రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు కాళ్లు పట్టుకున్న నాయకు డు.. ఈ రోజు పరకాల ఎమ్మెల్యే అయ్యాడని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ మంత్రి పదవికి ఢోకా లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ.. బీఆర్ఎస్ లో ఉండి.. ఆ పార్టీలను నాశనం పట్టించిన నేతలు ఇప్పు డు కాంగ్రెస్ లో చేరి పార్టీని కరాబు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంత్రి కొండా సురేఖ ఆ తర్వాత రోజు కడియం శ్రీహరి కల్లికుంట్ల అని అన్నారు. దీంతో వీరిద్దరిపై ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక్కటైయ్యారు.