TG Crime: వనపర్తిలో ఆటోను తొక్కేసిన లారీ.. ఇద్దరు స్పాట్ డెడ్.. షాకింగ్ వీడియో!

వనపర్తి జిల్లా రాయికల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయికల్ రైస్ మిల్ దగ్గర ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Wanaparthy Crime News

Wanaparthy Crime News

TG Crime: వనపర్తి జిల్లా రాయికల్ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాయికల్ రైస్ మిల్ దగ్గర ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ..

ఈ ప్రమాదంలో మృతి చెందినవారిని వనపర్తి జిల్లాకు చెందిన రాజు, రవిగా పోలీసులు గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

https://x.com/TeluguScribe/status/1968528778864509200


ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. రూ.50 వేలు అప్పిచ్చి ఆత్మహత్య చేసుకున్న భార్య, కొడుకు

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతివేగంగా వాహనాలను నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా వనపర్తి-రాయికల్ మార్గంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

ఇది కూడా చదవండి: నెల్లూరులో ఘోరం.. ఏడేళ్ల బాలుడిని గొంతు నులిమి.. చంపింది వాళ్లేనా?

Advertisment
తాజా కథనాలు