/rtv/media/media_files/2025/03/23/VVYDnlnlCVaHyFzifrS0.jpg)
Road Accident
Road accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. రాంనగర్ పరిధి అడిక్మెట్ బ్రిడ్జిపై ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో కిందపడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.